Header Banner

విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

  Sat May 24, 2025 07:05        India

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో మరో మూడు నెలల్లోనే నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయాలని ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. అంతేకాకుండా 2028 నాటికి విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ పట్టణానికి విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎమిరేట్స్ విమానాలను కూడా ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

 

 

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కమిటీ గురువారం రోజు సమావేశం నిర్వహించింది. ఇందులో ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఇంఛార్జీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి, జీఎం రామాచారి, ఎస్పీ గాంగాధర రావు, అధికారులతో కలిసి పాల్గొని.. విమానాశ్రయ అభివృద్ధితో పాటు ప్రయాణికుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రతి రాష్ట్రానికి అనుసంధానం అయ్యేలా విమాన సర్వీసులు నడిపేందుకు వివిధ విమానయాన సంస్థలతో సంప్రదించినట్లు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

ఇవి మాత్రమే కాకుండా విజయవాడ నుంచి శ్రీలంక, సింగపూర్, థాయ్ లాండ్, దుబాయ్ లకు ఎమిరేట్స్ విమానాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని మంత్రి బాలశౌరి వివరించారు. అలాగే ప్రతి నెలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా టెర్మినల్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అందులో ప్రాచీన సంస్కృతి, కూచిపూడి భంగిమలు ఉంటాయన్నారు.

 

సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ ల ఆదేశాలతోనే.. 12 డిజెన్లను మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేశినేని చిన్నా చెప్పారు. వారణాసి, కొచ్చి, అహ్మదాబాద్ లకు కొత్త సర్వీసులు నడిపేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక వేగవంతం అయ్యాయని అన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారంవెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


   #AndhraPravasi #VijayawadaAirport #InternationalAirport #IntegratedTerminal #NewYorkFlights #EmiratesFlights #AirportDevelopment #AndhraPradesh